28, ఫిబ్రవరి 2013, గురువారం
లగ్జరీ అంటే లేచిపోతుంది!
ఖరీదైన వాహనాల కొనుగోలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కార్లు, టూవీలర్స్ ను ఉన్నతస్థాయి వర్గాలు విపరీతంగా కొంటున్నాయి. వీటిపై కొత్త బడ్జెట్ లో భారీగా వాత వేశారు చిదంబరం. విదేశీ కార్లపై వందశాతం ఇంపోర్ట్ డ్యూటీ విధించారు. 800 సీసీ ద్విచక్ర వాహనాలపై 15 శాతం ట్యాక్స్ పెంచారు. గతంలో ఇది 60 శాతం ఉండగా, ఇప్పుడు 75 శాతం పెరగనుంది. SUV లపై ఎక్సైజ్ ట్యాక్స్ ను 27 శాతం నుంచి 30 శాతానికి పెంచారు. ఇది ఉన్నతవర్గాలకు మింగుడు పడని విషయమే. విదేశీ కార్లు కొని తమ స్పెషాలిటీని చాటుకోవాలనుకునే వాళ్లు ఇకపై మరింతగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
సెల్లుకూ బిల్లే..!
ప్రతీ ఒక్కరికీ కనీస అవసరంగా మారిన సెల్ ఫోన్ నూ వదిలిపెట్టలేదు చిదంబరం. రెండు వేల రూపాయల ఖరీదు దాటిన ప్రతీ ఫోన్ పైనా 6 శాతం పన్ను విధించారు ఆర్థికమంత్రి. ఇకపై ఫోన్లు కూడా ఖరీదు కానున్నాయి.
పొగరాయుళ్లకు మొహాన పొగకొట్టారు చిదంబరం. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై 18 శాతం ఎక్సైజ్ ట్యాక్స్ వేశారు. ట్యాక్స్ స్లాబ్ లను మాత్రం మార్చలేదు చిదంబరం. రెండు లక్షల నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించేవారికి మాత్రం రెండు వేల రూపాయల ట్యాక్స్ క్రెడిట్ చేస్తామని హామీ ఇచ్చారు.
కోటిరూపాయలు పైన సంపాదిస్తున్న వారు కేవలం 42600 మంది మాత్రమే ఉన్నారని చెప్పిన చిదంబరం, కోటి రూపాయల ఆదాయం దాటిన వ్యక్తిగత, హిందూ అవిభాజ్య కుటంబాలకు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరానికి పది శాతం సర్ ఛార్జ్ విధించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి