21, ఫిబ్రవరి 2013, గురువారం
విమాన టికెట్ ధరలు తగ్గాయోచ్..!
Categories :
air india . airlines . news . plane ticket charges . TOP
విమానయాన కంపెనీల మధ్య చౌక ధరల యుద్ధం మొదలయ్యింది. విమానయాన సంస్థలు పోటాపోటీగా టికెట్ ధరలను తగ్గిస్తున్నాయి. 2013 రూపాయలకే టికెట్ అంటూ జనవరిలో మూడురోజుల్లోనే పదిలక్షల టికెట్లను అమ్మి సంచలనం సృష్టించింది స్పైస్జెట్. తాజాగా ఒక్కో టికెట్ను 2250 రూపాయల చొప్పున 20 లక్షల టికెట్లను అమ్ముతామని జెట్ ఎయిర్వేస్ చేసిన ప్రకటన ఎయిర్ క్రాఫ్ట్ కారియర్స్లో ప్రకంపనలు పుట్టించింది. జెట్ ఎయిర్వేస్ దెబ్బకు ఇండిగో, గో ఎయిర్లు కూడా టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
తాజాగా ఈ చౌకధరల యుద్ధంలోకి ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియా కూడా దిగింది. భారీ నష్టాలతో సతమతమవుతున్న ఎయిర్ఇండియా ప్రయాణీకులను ఎక్కువగా ఆకర్షించడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని భావిస్తోంది. అందుకే, టికెట్ ఛార్జీల్లో 40 శాతం వరకూ తగ్గించింది. కొన్ని రూట్లలో ప్రైవేటు కారియర్లకన్నా తక్కువ ధరకే ఎయిర్ ఇండియా టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ - హైదరాబాద్ మధ్య ఇండిగో టికెట్ ధర 3290, జెట్ ఎయిర్వేస్ టికెట్ ధర 3350, స్పైస్జెట్ టికెట్ ధర 4641 రూపాయలు ఉండగా.. ఎయిర్ ఇండియా టికెట్ 3201 రూపాయలకే ఇప్పుడు లభిస్తుంది. ఖాళీగా విమానాలను తిప్పడం కన్నా తక్కువ ధరకే టికెట్లను అమ్ముకోవడం బెస్ట్ అన్న పాలసీకే ఇప్పుడు ఎయిర్ఇండియా మగ్గుచూపతున్నట్లు కనిపిస్తోంది.
విమానసంస్థల మధ్య నెలకొన్న పోటీని అటు డీజీసీఏ, ఇటు కేంద్ర ప్రభుత్వం నిశితంగానే పరిశీలిస్తున్నాయి. ఛార్జీలు భారీగా తగ్గించడం వల్ల .. నష్టాలు ఎదురవుతాయేమో చూసుకోవాలంటూ, విమాన సంస్థలను ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అయితే, ఛార్జీలను ఇంతే వసూలు చేయాలంటూ కేంద్రం నిర్ణయించే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి