21, ఫిబ్రవరి 2013, గురువారం
గిరిజనులపై మావోయిస్టుల దుశ్చర్య
ఆంధ్రా ఒరిస్సా బోర్డర్లో మావోయిస్టులు చెలరేగిపోయారు. ఇన్ఫార్మర్ల అన్న నెపంతో గిరిజనుల గొంతు కోశారు. గూడెం కొత్తవీధి మండలం లక్కవరంలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. రెండు మృతదేహాలు అటవీప్రాంతంలోల భించగా, గాయపడ్డ ఆరుగురిలో ఒకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఈ కాల్పులకు తెగబడింది ఆంధ్రా ఒరిస్సా బోర్డర్లోని తూర్పుదళం సభ్యుడు జాంబ్రీగా తెలుస్తోంది. ఇతనిపై ఇప్పటికే నాలుగు లక్షల రూపాయల రివార్డ్ ఉంది. 8 ఏళ్ల నుంచి జాంబ్రీ అజ్ఞాతంలో ఉన్నాడు. అయితే.. ఈ ఘటనపై మావోయిస్టులు ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి