11, ఫిబ్రవరి 2013, సోమవారం
హిమాలయాలపై నీటి బాంబట..ఎప్పుడైనా పేలొచ్చట
Categories :
environment . flood . himalayas . news . sikkim . TOP . water bomb
హిమాలయాల దిగువన ఉన్న సిక్కిం రాష్ట్రానికి భారీ ప్రమాదం పొంచి ఉంది. హిమాలయాలపై 7 వేల అడుగుల ఎత్తున ఏర్పడిన ఓ భారీ నీటిసరస్సు ఏ క్షణమైనా కట్టలు తెంచుకుని విరుచుకుపడే అవకాశం ఉంది. వివిధ రకాల ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన తర్వాత, హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఈ నిర్ధారణకు వచ్చింది. సిక్కిం రాష్ట్రంలో ఉన్న హిమాలయాల్లోని దక్షిణ ల్హోనాక్ గ్లేసియర్ లో భారీగా నీరు చేరినట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. ఈ సరస్సు 630 మీటర్ల వెడల్పుతో, 20 మీటర్ల లోతులో ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ఇందులో 1970 కోట్ల లీటర్ల నీరు ఉండొచ్చని అంచనా. దీనిచుట్టూ గుల్లగా ఉండడంతో ఏ క్షణమైనా దీనికి గండి పడవచ్చని భావిస్తున్నారు. ఇంత ప్రవాహం ఒక్కసారిగా కిందకు వస్తే, భారీ విధ్వంసం తప్పదని హెచ్చరిస్తున్నారు దీనిపై పరిశోధన చేసిన సైంటింస్ట్ బాబు గోవింద రాజ్. అయితే, నేరుగా వెళ్లి పరిశీలిస్తే గానీ, ఈ ప్రమాదం ఎప్పుడు జరగవచ్చో కచ్చితంగా చెప్పలేమంటున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి