24, జనవరి 2013, గురువారం
జగన్ కు ఇక జైలే గతి
భారత దేశాన్ని కొల్లగొట్టడానికి మహ్మద్ ఘోరీ 17 సార్లు దండయాత్రలు చేసినట్లుగా.. బెయిల్ దక్కించుకోవడానికి వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాలు ఏమాత్రం ఫలించడం లేదు. తాజాగా
హైకోర్టులోనూ జగన్ కు చుక్కెదురయ్యింది. జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. బెయిల్ కు అనర్హమైందిగా భావిస్తూ పిటిషన్ ను కొట్టేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, బెయిల్ పటిషన్ విచారణార్హం కాదని పేర్కొంది హైకోర్ట్. అటు సీబీఐ దర్యాప్తుకు కాలపరిమితి విధించాలన్న జగన్ తరపు న్యాయవాదుల విజ్ఞప్తిని కూడా కోర్టు తిరస్కరించింది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకే చెప్పుకుని ఉండాల్సిందని ధర్మాసనం పేర్కొంది. దీంతో, సీబీఐ దర్యాప్తు సాగే అవకాశం ఉంది. అప్పటివరకూ జగన్ జైల్లోనే మగ్గిపోవాల్సి ఉండొచ్చు. హైకోర్టు నిర్ణయంతో జగన్ కుటుంబ సభ్యులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నిరాశలో కూరుకుపోయారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి