27, జనవరి 2013, ఆదివారం
మళ్లీ మెలికపెట్టారు..!
తెలంగాణపై అన్నట్లే నెలరోజుల్లోగా కేంద్రం హోంమంత్రి ఓ ప్రకటన చేశారు. అయితే, చెప్పినట్లుగా నిర్ణయాన్ని ప్రకటించకుండా, నిర్ణయానికి మరికొంత గడువు కావాలని అందులో పేర్కొన్నారు. సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కానందున నిర్ణయాన్ని వెలువరచలేకపోతున్నట్లు తెలిపారు. అంతకు ముందు కాంగ్రెస్ కోర్ కమిటీ వరసగా నాలుగోసారి సమావేశమై తెలంగాణ అంశంపై చర్చలు జరిపింది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ, సంప్రదింపులు ఎన్ని రోజులు జరుగుతాయన్నదానికి నిర్దిష్టమైన గడువేదీ లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని, పీసీసీ చీఫ్ ను, మూడు ప్రాంతాల నేతలను త్వరలోనే ఢిల్లీకి పిలిచి మాట్లాడతామన్నారాయన. అనంతరం పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. దాని తర్వాత ... కేంద్రం విభజనపై తన వైఖరిని ప్రకటిస్తుందన్నారు. దీంతో.. ఈ అంశం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి