23, జనవరి 2013, బుధవారం
తెలంగాణపై ఎల్లుండే తేలిపోతుందా..? సీఎంను ఎందుకు పిలిచినట్లు?
ఢిల్లీ రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తంగా మారుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఓవైపు సీమాంధ్ర నేతలు, ఎలాగైనా సరే తెలంగాణ తెచ్చుకోవాలని టీకాంగ్రెస్ నేతలు ఇప్పటికే హస్తినలో హడావుడి చేస్తున్నారు. వీరిలో ఎవరివైపు అధిష్టానం మొగ్గు చూపుతుందన్నది తెలియడం లేదు. ఓ దశలో అయితే, షిండే చెప్పిన గడువులోగా ప్రకటన చేస్తారా లేదా అన్నదానిపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, రెండు రోజుల పాటు అందుబాటులో ఉండాలంటూ సీఎం కిరణ్ కు కాంగ్రెస్ హైకమాండ్ కబురు పంపడంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలయ్యింది. ఎల్లుండి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కానుంది. రిపబ్లిక్ డే ముందు జరుగుతున్న ఈ భేటీలోనే తెలంగాణ అంశంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలున్నాయి. ఇప్పటికే సాగునీరు, శాంతి భద్రతల విషయంలో అధికారులతో చర్చలు జరిపిన కేంద్రం, ఇప్పుడు సీఎంను పిలవడంతో.. తెలంగాణపై ఏదో ఓ నిర్ణయం రిపబ్లిక్ డే తర్వాత వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి