23, డిసెంబర్ 2012, ఆదివారం
ఆర్టీసీ ఎన్నికలు రాజకీయ పార్టీల వైఖరిలో మార్పు తెస్తాయా..?
వాడివేడిగా సాగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ఉత్కంఠ భరిత ఫలితాలను ఇచ్చాయి. ఆర్టీసీలో ఇంతకాలం ఏకఛత్రాధిపత్యం వహిస్తూ వచ్చిన నేషనల్ మజ్జూర్ యూనియన్ ఈ ఎన్నికల్లో చావు దెబ్బతింది. ఎంప్లాయిస్ యూనియన్-తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూటమి ఘన విజయం సాధించింది. అయితే.. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలపైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
తెలంగాణ మజ్దూర్ యూనియన్ తో కలిసి ఎంప్లాయిస్ యూనియన్ కూటమిగా ఏర్పడడంతోనే ఈ ఎన్నికలకు విశేష ప్రాధాన్యం లభించింది. సమైక్యవాదాన్ని బలపరిచేదిగా ఎన్ఎంయూ, తెలంగాణకు మద్దతిచ్చేదానిగా ఎంప్లాయిస్ యూనియన్-తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూటమి అంటూ ప్రచారం సాగింది. అయితే.. తెలంగాణ ప్రాంత కూటమితో పొత్తుపెట్టుకున్న ఎంప్లాయిస్ యూనియన్ సీమాంధ్రలోని మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం రాజకీయవర్గాలను నివ్వెర పరుస్తోంది. తెలంగాణ వాదానికి సీమాంధ్ర ప్రజలు మద్దతు ఇస్తున్నారనడానికి ఇదే నిదర్శనమంటోంది తెలంగాణ రాష్ట్ర సమితి. రెండు కళ్ల సిద్ధాంతంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న తెలుగుదేశం కూడా ఈ ఫలితాలను విశ్లేషించే పనిలో పడింది. డిసెంబర్ 28న జరగనున్న అఖిలపక్ష సమావేశానికి ముందు ఈ ఫలితాలు రావడం... రాజకీయ పార్టీల వైఖరిలో మార్పు తెచ్చే అకాశాలు కనిపిస్తున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి