15, డిసెంబర్ 2012, శనివారం
27 మంది ప్రాణాలు తీసిన అమెరికా ఉన్మాది
Categories :
gun culture . news . TOP . us shooting . world
అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని ఓ స్కూల్ బుల్లెట్ల మోతతో హోరెత్తిపోయింది. న్యూటౌన్లోని శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూల్లోకి ప్రవేశించిన ఓ సైకో.. ఒక్కసారిగా కాల్పులు జరపాడు. హాల్స్, క్లాస్ రూమ్స్లోకి వెళుతూ.. బుల్లెట్ల వర్షం కురిపించాడు. దాదాపు వంద రౌండ్ల మేర కాల్పులు జరిపాడు. ఎన్నో ప్రాణాలను పొట్టనపెట్టుకున్నాడు...
శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూల్ చాలా పేరు ప్రఖ్యాలుతున్నాయి. కిండర్ గార్డెన్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకూ ఉన్న ఈ స్కూల్లో కాల్పులు జరిగే సమయానికి 600 మందికి పైగా పిల్లలు ఉన్నారు. కాల్పుల శబ్ధం వింటూనే.. స్కూల్లో అలజడి చెలరేగింది. పిల్లలు, టీచర్లు, సహాయక సిబ్బంది అంతా తలోదిక్కూ పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్కూల్కు చేరుకున్నారు. హంతకుడు చనిపోయినట్లు నిర్ధారించుకుని.. పిల్లలను స్కూల్ బయటకు తీసుకువచ్చారు. ఈ సంఘటనలో.. హంతకుడి తల్లి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. చాలామందికి తీవ్ర గాయాలు కావడంతో.. వారి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.
స్కూల్లో కాల్పుల సంగతి తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందారు. చాలామంది పరుగుపరుగున స్కూల్ దగ్గరకు చేరుకున్నారు. పిల్లలు, తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదమయంగా మారింది. అటు ఈ దాడి సంగతి తెలియగానే.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కన్నీరు పెట్టుకున్నారు. అమెరికా చరిత్రలోనే... ఇది రెండో అతిపెద్ద కాల్పుల ఘటన. స్కూల్లో మారణహోమం సృష్టించిన యువకుడిని 24 ఏళ్ల ర్యాన్ లాంజాగా గుర్తించారు. పిల్లలు పెద్దలన్న తేడా లేకుండా.. ఎంతోమంది ప్రాణాలు తీసిన.. ఆ కిరాతకుడు.. చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు..ర్యాన్.. ఈ కాల్పులకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయం ఇంకా తెలియడం లేదు. అతని తల్లిని కూడా కాల్చి చంపడం వెనుక ఏదో కారణమే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి