18, నవంబర్ 2012, ఆదివారం
జగన్ పార్టీలోకి తెలంగాణ యాంకర్ రాణి రుద్రమ
టీన్యూస్ లో ప్రధాన యాంకర్ గా పనిచేసిన రాణి రుద్రమ.. జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ ఉదయం విజయమ్మను జగన్ నివాసంలో కలుసుకున్న రుద్రమ.. వైకాపా జెండాను మెడలో వేసుకున్నారు. టీ న్యూస్ (గతంలో రాజ్ న్యూస్) లో పనిచేసిన సమయంలోనూ, నంది అవార్డుల సమయంలో తెలంగాణ గళాన్ని గట్టిగా వినిపించిన యాంకర్ రుద్రమ. వరంగల్ కు చెందిన రుద్రమ, కెరీర్ ఈటీవీ-2తో ప్రారంభమయ్యింది. కొంతకాలం పాటు పనిచేసి మానివేసిన తర్వాత.. టీవీ9 చేరారు. అక్కడినుంచి సాక్షి టీవీ లోకి, ఆ తర్వాత టీ న్యూస్ లోనూ చేరారు. టీ న్యూస్ లో చర్చలు చేస్తూ.. తెలంగాణ యాంకర్లకు ప్రతినిధిగా నిలిచారు. అయితే.. కొంతకాలంగా వైకాపాలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న టీన్యూస్ యాజమాన్యం ఆమెను పూర్తిగా పక్కనపెట్టింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కదని తెలియడంతోనే ఆమె జగన్ పార్టీలో చేరినట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గానికి చెందడంతో, ఆమె జగన్ పార్టీనే సేఫ్ గా భావించినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే, అన్ని ఛానళ్లలోనూ పనిచేసి వచ్చేసిన ఆమెకు.. సాక్షి ఛానల్ తప్ప మరెవరూ కవరేజ్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అయితే.. తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించే రుద్రమ, సడన్ గా జగన్ పార్టీలో ఎందుకు చేరారన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి