6, అక్టోబర్ 2012, శనివారం
జనంలోకి జగన్ భార్య
జగన్ కు బెయిల్ వస్తుందన్న ఆశలు ఆవిరైపోయాయి. అంతేకాదు, మరోసారి ప్రయత్నించడానికీ ఇప్పట్లో అవకాశం లేకుండా పోయింది. విచారణ పూర్తయ్యాకే బెయిల్ కోసం వెళ్లమని సుప్రీంకోర్టు చెప్పేయడంతో.. జగన్ అప్పటివరకూ జైల్లో ఊచలు లెక్కపెట్టుకుంటూ కూర్చోవాల్సిందే. సుప్రీం నిర్ణయంతో వైఎస్సార్ సీపీ కేడర్ లో కూడా నిస్తేజం ఆవరించింది. కచ్చింతగా బెయిల్ వస్తుందనుకుంటే, సీన్ రివర్స్ అయ్యింది. ఇంకా మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చుంటే లాభం లేదని తెలుసుకున్న విజయమ్మ.. జనంలోకి వెళ్లి జగన్ విషయంలో సానుభూతిని సంపాదించుకోవాలనుకుంటున్నారు. అన్యాయంగా జగన్ ను జైల్లో పెట్టారంటూ ఓదార్పు కోరబోతున్నారు. ప్రజల్లోకి విజయమ్మతోపాటు షర్మిల కూడా వెళ్లనున్నారు. గత ఉప ఎన్నికల్లో వీరిద్దరూ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వీరితో పాటే జగన్ భార్య భారతి కూడా జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ యాత్ర జగన్ మధ్యలోనే వదలిపెట్టిన ఓదార్పు రూపంలో చేయాలా? లేక వైఎస్ లా పాదయాత్ర చేయాలా అన్న విషయంలో ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. మహిళలు కాబట్టి పాదయాత్ర చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందన్న అభిప్రాయమూ నేతల్లో వ్యక్తమవుతోంది. అదే ఓదార్పు తరహాలో రాష్ట్రాన్ని చుట్టివస్తే, జనంలో క్రేజ్ పెరగడంతో పాటు, సానుభూతి దక్కుతుందని నేతలు అంచనా వేస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి