5, అక్టోబర్ 2012, శుక్రవారం
మరో ఆర్నెల్లు జైల్లోనే జగన్
సుప్రీంకోర్టులో వైఎస్ జగన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ వస్తుందనుకుంటే.. అసలుకే ఎసరొచ్చింది. సీబీఐ క్షక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న జగన్ వాదన కోర్టులో నిలవలేదు. అదే సమయంలో సీబీఐ గట్టిగా వాదించడంతో.. వారివైపే ధర్మాసనం మొగ్గుచూపింది. మారిషస్ నుంచి లగ్జెంబర్గ్ మీదుగా అక్రమంగా నిధులు వచ్చాయన్న సీబీఐ.. వాటికి సంబంధించిన కచ్చితమైన ఆధారాలున్నాయని కోర్టుకు తెలిపింది. దీనిపై నోట్ ఫైల్ ను సమర్పించింది. నాలుగు ఛార్జిషీట్లలో 3వేల కోట్లకు పైగా అక్రమంగా జగన్ సంపాదించినట్లు గుర్తించామని సీబీఐ చెప్పింది. జగన్ కేసులో విచారణ పూర్తి కాలేదని, ఇంకా కొనసాగుతోందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే.. సాక్షులను బెదిరించి, విచారణకు అడ్డుపడవచ్చని వాదించింది. దీంతో ఏకీభవించిన కోర్టు.. పదేళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారంటూ జగన్ తరపు లాయర్లను ప్రశ్నించింది. జగన్ కు బెయిల్ ఇవ్వలేమని తేల్చేసింది. మరోసారి బెయిల్ పిటిషన్ కు అనుమతించాలన్న లాయర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. మార్చి 31లోగా జగన్ కేసులో విచారణ పూర్తి చేయాలని సీబీఐను ఆదేశించిన కోర్టు.. మార్చి 31 తర్వాతే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని జగన్ కు సూచించింది. సుప్రీం నిర్ణయంతో ఆరునెలల పాటు జగన్ జైల్లో నే ఉండాల్సి వస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి