4, అక్టోబర్ 2012, గురువారం
తెలంగాణ మార్చ్ లో పొరపాటు జరిగిందన్న టీజేఏసీ
తెలంగాణ ఉద్యమ సాధనలో కీలక మలుపుగా భావిస్తున్న హైదరాబాద్ కవాతులో పొరపాటు జరిగినట్లు టీజేఏసీ చెబుతోంది. కవాతు జరిగిన తీరుపై విశ్లేషణ జరిపిన నేతలు.. మరోసారి అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని నిర్ణయించారు. మార్చ్ ను ప్రభుత్వం ఇచ్చిన గడువు ప్రకారం రాత్రి 7 గంటలకు ముగించాలని ముందు భావించినా... ఒకరిద్దరు చెప్పడంతో కొనసాగించాలని ప్రకటించాల్సి వచ్చిందని జేఏసీ నేతలు చెబుతున్నారు. చివరకు, అలా చేయడం సరికాదని భావించి అర్థరాత్రి సమయంలో హడావుడిగా మార్చ్ ను ముగించామన్నారు. అయితే.. ఆ ఒకరిద్దరు ఎవరన్నది నేతలు బయటపెట్టలేదు. పైగా, నేతలందరినీ కలుపుకోలేదన్న విమర్శను కూడా జేఏసీ గుర్తించింది. ఇకపై అందరినీ కలుపుకొని వెళ్లాలన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి