తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. చంచల్ గూడ జైల్లో జగన్ ను కలవడం.. టీడీపీ సస్పెండ్ చేయడం.. తదితర పరిణామాల నేపథ్యంలో ఆయన గుడివాడోల మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. విజయమ్మను కలిసిన రెండు నిమిషాలకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పారు. టీడీపీనుంచి తనకు తానుగా బయటకు రాలేదని.. నేతలంతా కలిసి తనను గెంటివేశారని ఆరోపించారు. వ్యక్తిగత కారణాలతోనే జగన్ ను కలిశానన్న కొడాలి.. సంజాయిషీ ఇవ్వడానికీ కూడా తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. తనకు చంద్రబాబు రాజకీయభిక్ష పెట్టలేదని.. హరికృష్ణ, ఎన్టీఆర్ లే తనకు భిక్ష పెట్టారని చెప్పారు. చంద్రబాబు నాయకత్వం మారితే తప్ప.. తెలుగుదేశం బాగుపడతన్నారు. ప్రస్తుతానికి టీడీపీలోనే కొనసాగుతునాన్న నాని.. జగన్ తో కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదన్నారు.
11, జులై 2012, బుధవారం
టీడీపీని వదలనన్న కొడాలి నాని
Categories :
gudiwada . kodali nani . POLITICS . tdp . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి