30, జూన్ 2012, శనివారం
ఆ మాట నిజం కాదన్న అబ్దుల్ కలాం!
సోనియాను ప్రధాని కాకుండా అడ్డుకున్నదెవరు..? అనధికారికంగా ఇంతవరకూ ప్రచారంలో ఉన్న విషయం మాత్రం అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ అనే. విదేశీయురాలన్న ట్యాగ్ తగిలించుకున్న సోనియాను నిరోధించింది ఆయనదేనని ఇంతకాలం లోకం కోడై కూసింది. దీనికి తోడు, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ప్రెసిడెంట్ పదవికి ఎప్పుడూ అబ్దుల్ కలాం ఊసు సోనియా ఎత్తకపోవడమూ దీనికి బలం చేకూర్చింది. అయితే.. ఇందులో నిజమెంతన్నది ఇప్పుడు బయటపడింది.
2004 ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కాంగ్రెస్ మాత్రమే ఎక్కువ సీట్లను సాధించిన అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో సంకీర్ణం అనివార్యమయ్యింది. ఈ సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ.. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాష్ట్రపతి అబ్దుల్ కలాం లేఖ రాశారట. మే 18న మధ్యాహ్నం 12.15కు సోనియా కలుస్తారని కలాంకు వర్తమానం వచ్చింది. సరిగ్గా సమయానికే ఆమె వచ్చారు. ఆమెతో పాటే, మన్మోహన్ కూడా వచ్చారు. తమకు అన్ని పార్టీల మద్దతుందని చెప్పిన సోనియా, ఆ పార్టీల మద్దతు లేఖలను మాత్రం అప్పటికి తేలేదు. రేపటికల్లా వాటిని తీసుకువస్తామని, ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వమని కోరారు. అయితే.. దీనిపై ఆలోచించిన కలాం, అప్పటి వరకూ ఆగుదామంటూ సూచించారు. కలాం నుంచి ఈ సమాధానం ఊహించని సోనియా.. అవాక్కయ్యారు. రాష్ట్రపతి భవన్ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత రాత్రి 8.15కు మళ్లీ సోనియా కలవడానికి వస్తారని సమాచారం వచ్చింది.
అప్పటి వరకూ సోనియానే ప్రధాని అభ్యర్థని కలాం భావించారు. అందుకు తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లను చేయించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన లెటర్లను సిద్ధం చేశారు. ఈ లోగానే కలాం ఎన్నో మెసేజ్ లు ,ఎన్నో ఈ మెయిల్స్ వచ్చాయి. అన్నింటి సారాంశం ఒక్కటే, విదేశీ మహిళను ప్రధానిని చేయవద్దనే. చెప్పినట్లుగానే ఆ రాత్రి సోనియా, మళ్లీ మన్మోహన్ సింగ్ తో వచ్చారు. ఈసారి లెటర్లను కూడా తెచ్చారు. కానీ, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేది తాను కాదని,మన్మోహన్ అని బాంబు పేల్చారు. ఇప్పుడు అవాక్కవడం కలాం పనయ్యింది. దీంతో, లెటర్లన్నింటి మార్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావాల్సిందిగా కలాం పేరుతో లెటర్లు సిద్ధం చేయించారు.
సోనియాను ప్రధాని కాకుండా అడ్డుకున్నది కలామేనని జరుగుతున్న ప్రచారం ఆయన దృష్టికీ వచ్చింది. దీంతో అసలు ఆ రోజు ఏంజరిగిందన్న విషయాన్ని కలాం బయటపెట్టారు. రాష్ట్రపతి భవన్లో గడిపిన రోజులను "టర్నింగ్ పాయింట్స్" పేరుతో పుస్తకంగా ప్రచురిస్తున్నారు. త్వరలోనే ఈ పుస్తకం విడుదల కానుంది. ఓ చిక్కుముడి విడిపోయింది కానీ.. సోనియా.. కలాంను ద్వేషించేది ఎందుకని..? ఈ ప్రశ్నకు సోనియా సమాధానం చెబుతారా..!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Congress will never encourage people with individuality.
మాఫియా లు ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహించవు గాబట్టి....వైఎస్ లాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేస్తారు గానీ కలాం లాంటి వాళ్ళను ఎందుకు ఎంకరేజ్ చేస్తారు...