30, జూన్ 2012, శనివారం
బెయిల్ బేహారి పట్టాభి
బెయిల్ ఫర్ సేల్.. అడిగినన్ని డబ్బులిస్తే.. ఎవరికైనా, ఎలాంటికేసులైనా బెయిల్ గ్యారెంటీ. అప్పుడెప్పుడో.. అక్కడెక్కడో న్యాయమూర్తి అవినీతి పరులని చదివిన మనకు.. ఇక్కడా ఉన్నానంటూ... నిరూపించాడు జస్టిస్ పట్టాభి. బెయిళ్లతో వ్యాపారం చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఇనుప గనుల అక్రమార్కుడు గాలి జనార్దనరెడ్డికి, బెయిల్ ఇవ్వడంపై శోధించిన ఏసీబీ మరో విషయాన్ని కూడా బయటపెట్టింది. అవినీతి కేసులో అరెస్ట్ అయి, ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ సర్వేశ్వరరెడ్డికి బెయిల్ ఇవ్వడానికీ..పట్టాభి లంచం తీసుకున్నాడట. పది లక్షల రూపాయలను వసూలు చేసి, అతనికి బెయిల్ మంజూరు చేశాడు. ఆ తర్వాత గాలి కేసులో భారీగానే డబ్బు డిమాండ్ చేశాడు. ఈ డీల్ కోసం పెద్దమొత్తంలోనే బేరసారాలు సాగాయి. పదికోట్ల రూపాయల నుంచి మొదలై.. చివరకు 5 కోట్లకు డీల్ సెటిల్ అయ్యింది. ఈ వ్యవహారంలో మరో కొత్తపేరూ బయటకు వచ్చింది. ఎలక్షన్ కమిషన్లో పనిచేస్తున్న ప్రభాకర్రావు.. ముందుగా ఈ ఆఫర్ను తీసుకొచ్చారు. దీన్ని తిరస్కరించిన పట్టాభి.. తిరిగి తన స్నేహితుడు రిటైర్డ్ జడ్జి చలపతిరావు ఈ ఆఫర్ తెచ్చేసరికి ఓకే అన్నారు. దీని కోసం నాచారంకు చెందిన యాదగిరిరావు, చలపతిరావులు కలిసి డీల్ ఫిక్స్ చేశారు. పట్టాభి కొడుకు రవిచంద్ర కూడా ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నాడు..
డీల్ ఓకే కావడంతో.. మే 11న గాలి జనార్దనరెడ్డికి జస్టిస్ పట్టాభి బెయిల్ మంజూరు చేశారు. ఈ తంతు జరుగుతున్న సమయంలో.. మొత్తం 12 సిమ్కార్డులను ఉపయోగించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పట్టాభిరామరావు కుమారుడు రవిచంద్ర, రిటైర్డ్ జడ్జీ చలపతిరావుల నేరాంగీకార వాంగ్మూలంలో ఈ విషయాలను ఏసీబీ పేర్కొంది. దీన్ని కోర్టుకు సమర్పించింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నా కొడుకుల్ని మనని కూడా ఎవడికైనా అమ్మేయమనండి ...పీడా వదులుద్ది...దొంగ నా బాబులు..డబ్బు కోసం అన్నీ వదిలేసారు నా ... వీళ్ళ లాంటి వాల్లను సపోర్ట్ చేసే గుంపొకటి...