15, జూన్ 2012, శుక్రవారం
కొత్త రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనే..!
ప్రతిభాపాటిల్ తర్వాత రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించనున్న వ్యక్తి పేరు దాదాపుగా ఖరారయ్యింది. ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీనే.. కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న యూపీఏ తమ అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీని ప్రకటించింది. ప్రణబ్ గెలిపించుకోవడానికి సరిపడా ఓట్లు తమవద్ద లేకపోయినా.. ఎన్డీఏ కూటమి దగ్గర గానీ, థర్డ్ ఫ్రంట్ దగ్గర కానీ, కాంగ్రెస్ ను మించిన ఓట్లు లేకపోవడంతో ప్రణబ్ ఎన్నిక ఖాయమనే చెప్పొచ్చు. ఓరకంగా రాష్ట్రపతి ఎంపిక విషయంలో మమత పాచిక పారలేదు. మమత బెదిరింపులకు భయపడకూదని నిర్ణయించిన సోనియా.. అవసరమైతే సంబంధాలు తెచ్చుకోవడానికీ సిద్ధమేనని తేల్చి చెప్పేశారు. ప్రణబ్ ముఖర్జీని కాకుండా.. మన్మోహన్, కలాం, సోమనాథ్ లలో ఒకరిని ఎంపిక చేస్తే మద్దతిస్తామంటూ.. సమాజ్ వాదీ పార్టీతో కలిసి మమత కొత్త సమీకరణాలకు తెరతీశారు. అయితే.. ఎన్ని గొడవలైనా కీలకసమయంలో కాంగ్రెస్ కు ప్రాణవాయువును అందించే ములాయం.. మమతకు చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చి.. సోనియాతో చేతులు కలిపారు. దీంతో.. బెంగాల్ దీదీ ఒంటరిగా మిగిలిపోయారు. ఎన్డీఏతో సత్సంబంధాలు లేకపోవడం.. ఒకవేళ ఎన్డీఏ పక్షాన నిలబడ్డా.. వారి అభ్యర్థి గెలుస్తాడన్న నమ్మకం లేకపోవడంతో.. బెంగాల్ బ్రదర్ ప్రణబ్ కు సపోర్ట్ చేయడం తప్ప మరో మార్గం ఆమె ముందు లేదనే చెప్పొచ్చు. కాబట్టి.. మన నెక్ట్స్ ప్రెసిడెంట్ ప్రణబే..
రాహుల్ కు లైన్ క్లియర్..!
వచ్చే ఎన్నికల్లో యూపీఏ మళ్లీ విజయం సాధిస్తే.. ప్రధాని పదవిని అందుకోవడానికి అనుభవం ఉన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ. మన్మోహన్ పై ఇంటా బయటా విమర్శలు వస్తుండడంతో.. ఈ సారి క్యాండిడేట్ ను మార్చడం తప్పనిసరి. పైగా, యువరాజుగా కాంగ్రెస్ శ్రేణులు కీర్తించే రాహుల్ గాంధీకి పట్టాభిషేకం చేయాల్సిన సమయం. కానీ, ప్రణబ్ ఉంటే, ఆయనకు పదవిని ఇవ్వకుండా, రాహుల్ ను ప్రధానిని చేస్తే.. విమర్శల పాలవుతామన్న అనుమానం సోనియాది. అందుకే.. ప్రణబ్ ను రాష్ట్రపతి భవన్ కు పంపించి... పార్లమెంట్లో రాహుల్ కు ఎదురులేకుండా చేస్తున్నారు. సవాలక్ష ఒత్తిళ్లతో సతమతమయ్యే కన్నా.. రాష్ట్రపతిగా రెస్ట్ తీసుకోవాలని అటు ప్రణబ్ కూడా అనుకుంటున్నారు.. అందుకే.. ఆల్ హ్యాపీస్..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి