11, జూన్ 2012, సోమవారం
డొక్కు బండిలో జగన్..
జగన్కు ఇవాళ పోలీసులు చుక్కలు చూపించారు. అతి తక్కువ కాలంలో వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతై.. ఇంద్ర భవనాలను నిర్మించుకొని.. అత్యాధునిక వాహనాల్లో తిరిగే జగన్ను.. సాదాసీదా పోలీస్ వ్యాన్లోకి ఎక్కించారు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన జగన్కు గతంలో కోర్టు విధించిన రిమాండ్ సోమవారంతో పూర్తయ్యింది. దీంతో.. చంచల్గూడ నుంచి కోర్టుకు తరలించడానికి జైలు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. సీబీఐ విచారణకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్లిన జగన్.. అదే స్థాయిలో ఊహించుకుని జైలు బయటకు అడుగుపెట్టారు. కానీ, అక్కడే ఊహించని షాక్.. సాధారణ ఖైదీలను తీసుకెళ్లే వ్యాన్ కనిపించింది. తాను ఎంపీనని, తనకిచ్చే మర్యాద ఇదేనా అంటూ అక్కడే ఆగ్రహం వెళ్లగక్కారు జగన్. కానీ, తమ వద్ద అదే ఉందని, మరోది లేదని పోలీసులు చెప్పడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో అందులో ఎక్కారు. కోర్టుకు చేరుకున్నాక, జడ్జి ముందు తన ఆవేదన వెళ్లగక్కారు. ఇలాగే చేస్తే జైల్లోనే నిరాహార దీక్ష చేస్తానంటూ బెదిరించారు. అయితే.. సరైన రక్షణ ఏర్పాట్లు చేయాలని న్యాయమూర్తి ఆదేశించడంతో.. తిరిగి జైలుకు తీసుకువెళ్లేటప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపయోగించారు. ఈ నెల 25 వరకూ జగన్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. అన్నట్లు.. గతంలో నిమ్మగడ్డ ప్రసాద్ను, మోపిదేవిని, జగన్ కేసులో అరెస్ట్ అయిన నిందుతులను ఇదే వాహనంలో తరలించినా.. పాపం వారెవరూ నోరు మెదపలేదు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
జేబులూ గొలుసులూ కొట్టేసే వాళ్ళు చిల్లర దొంగలు.
... పాపం వీళ్ళని తన్ని యీడ్చుకు పోతుంటారు.
... దొరికిన దొంగలు నరకవాసం బెటరనుకోవాలి.
ఆమ్యామ్యాలు అందుకొనే ఉద్యోగులు మధ్యతరగతి దొంగలు.
... వీళ్ళని కొంచెం మర్యాదగా చూస్తారేమో!
... వాళ్ళని ఆదుకొనే వాళ్ళుంటారు సుమా.
దేశాన్ని కొల్లగొట్టే వాళ్ళు ఘరానాదొంగలు.
... వీళ్ళని మహారాజుల్లా చూడాలి మరి.
... లేకపోతే వీళ్ళ డిగ్నిటీకి భంగం కదా.