26, ఏప్రిల్ 2012, గురువారం
రాజ్యసభకు సచిన్ టెండుల్కర్
ఇప్పటివరకూ క్రికెట్ మైదానం చిచ్చర పిడుగులా చెలరేగిన సచిన్ టెండుల్కర్... ఇకపై పొలిటికల్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టబోతున్నాడు. త్వరలోనే సచిన్ రాజ్యసభ ఎంపీ అయ్యే అవకాశాలున్నాయి. రాజ్యసభకు రాష్ట్రపతి ఎంపిక చేయాల్సిన 12 మందిలో ఒకరిగా సచిన్ టెండుల్కర్ ను ఎంచుకోవాలంటూ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఓ లేఖ రాశారు. ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని సచిన్ దంపతులు కలుసుకున్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లాతో కలిసి వీరిద్దరూ సోనియా నివాసానికి వెళ్లారు. రాజ్యసభకు నామినేట్ చేయడానికి అంగీకారం తెలిపారు. ఎంపీగా ఎంపికైనాప్పటికీ క్రికెట్ కెరీర్ ను కొనసాగించాలనే సచిన్ నిర్ణయించుకున్నాడు. సచిన్ కు రాజ్యసభ ఎంపీ పదవిని ఇవ్వడంపై అన్ని వర్గాలనుంచి హర్షం వ్యక్తమవుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి