14, మార్చి 2012, బుధవారం
రైల్వే మంత్రి పదవికి గండం తెచ్చిన బడ్జెట్..
Categories :
mamatha . news . railway budget . railway minister . TOP
ప్రతిష్టాత్మక రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి దినేశ్ త్రివేదికి.. అదే బడ్జెట్ పదవీ గండాన్ని తెచ్చిపెట్టింది. బడ్జెట్లో రైలు ఛార్జీలను పెంచిన పాపానికి ఏకంగా తన పదవినే కోల్పోవాల్సి వచ్చింది. దీనికి కారణం ఎవరో కాదు.. బెంగాలీ దీదీ మమతా బెనర్జీ. తనకు ముఖ్యమంత్రి పదవి లభించడంతో, అంతవరకూ తాను పాలించిన రైల్వే మంత్రిత్వ శాఖను ఏరికోరి తన పార్టీ ఎంపీ దినేశ్ త్రివేదీకి అప్పజెప్పింది మమతా బెనర్జీ. అయితే.. ఈ సారి రైల్వే బడ్జెట్లో ఛార్జీలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా, ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. అయితే.. దీనికి త్రివేదీ నిరాకరించడంతో మమతా కన్నెర్ర చేసింది. దినేశ్ త్రివేదీని మంత్రి పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో ముకుల్ రాయ్ ను నియమించాలంటూ ప్రధానికి సిఫార్సు చేస్తూ ఓ లేఖను కొద్ది సేపటి క్రితం మమతా బెనర్జీ రాశారు. అయితే.. దీనిపై ప్రధాని ఎలా స్పందిస్తారన్నదానిపైనే రాజకీయం ఎలా మారుతుందన్నది ఆధారపడి ఉంది. అవసరమైతే, యూపీఏకు మద్దతు ఉపసంహరించడానికి కూడా మమత సిద్ధంగా ఉన్నట్లు సమాచారం..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి