6, మార్చి 2012, మంగళవారం
సైకిల్ జోరు.. ఏనుగు బేజారు
Categories :
mulayam . POLITICS . samajwadi win . TOP . up results
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అందరి అంచనాలను మించిపోయాయి. ములాయం నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ భారీ మెజార్టీని సంపాదించింది. మరెవరీసాయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 202 స్థానాల్లో గెలుపొందాలి. సమాజ్ వాదీ పార్టీ 224 స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న మాయావతి పార్టీ బీఎస్పీ ఘోర పరాభవాన్ని పొందింది. కేవలం 80 సీట్లనే సాధించగలిగింది. ఇక బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. బీజేపీకి 47 స్థానాలు లభించాయి. రాహుల్ ఇమేజ్ తో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే అత్యంత ఘోరం. రాహుల్ రాష్ట్రమంతా తిరిగినా, యూపీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినా కేవలం 38 స్థానాల్లోనే గెలవగలిగింది. మొత్తానికి ఎస్పీ సైకిల్ జోరుకు.. బీఎస్పీ సహా, కాంగ్రెస్, బీజేపీలు కొట్టుకుపోయాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి