30, ఆగస్టు 2011, మంగళవారం
పార్లమెంటుకు ఎందుకు వెళ్లాలి?
పార్లమెంటుకు ఎందుకు వెళ్లాలి.. అసలు జనం గెలిపించి పార్లమెంటుకు పంపిస్తోంది ఎందుకోసం...? ప్రజలను పాలించాలనా..? ప్రజాసమస్యలను చర్చకు తెచ్చి పరిష్కరించాలనా? చట్టాలు చేయాలనా? ఎందుకోసం.. ఎందుకోసం..? ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులను గెలిపించుకునేది వీటికోసమే అయినా.. మన ఎంపీలు ఎన్నికవుతోంది మాత్రం ఇందుకోసం కాదట. పార్లమెంటుకు వెళ్లడంలో వీరి ఉద్దేశం మరొకటి ఉంది. అదే పార్లమెంట్ క్యాంటీన్.
వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ అభిప్రాయం ప్రకారం పార్లమెంటుకు వెళ్లాల్సింది క్యాంటీన్ కోసమే. పార్లమెంట్లో క్యాంటీన్లో మంచి బిర్యానీ అగ్గువకే దొరుకుద్ది.. పావలాకే చిక్కటి చాయ్ పోస్తరు.. అందుకే పార్లమెంటుకు పోతున్నా.. అని సెలవిచ్చారు సదరు ఎంపీ. రెండేళ్లుగా కొట్లాడుతున్నా లేనిది అర్థగంటలోనే తెలంగాణ రాదని, అందుకే, తాము పార్లమెంటుకు వెళ్లినా ఉపయోగం లేదని ఆయన చెబుతున్నారు. తక్కువ ధరకే బిర్యానీ తిని, పావలాకే చాయ్ తాగడం కోసం జనం సొమ్ము ఖర్చుపెట్టిన వరంగల్ నుంచి ఢిల్లీ దాకా వెళుతున్నారు మరీ.. పాపం పేద ఎంపీ కదా.. రూపాయి రూపాయీ లెక్కేనాయే.. మహబూబాబాద్ జనాలైనా విషయం తెలుసుకొని.. ఫ్రీగా బిర్యానీ, ఫ్రీగా చాయ్ అందిస్తే.. ఎంపీగారు ఊరు దాటరేమో..!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి