24, ఆగస్టు 2011, బుధవారం
తెలివంతా మీదే..!
గోదావరి నీళ్లు తాగితే తెలివితేటలు పెరుగుతాయి. ఇది ఎవరైనా అనే మాటే. కానీ తెలంగాణవాళ్లకు మాత్రం గోదావరి నీళ్లు తాగినా తెలివి పెరగటం లేదట. అదే టైంలో.. రాజమండ్రివాసులు మాత్రం మేధావులు తయారవుతున్నారట... ఈ అనలిసిస్ ఎవరిదో కాదు... రాష్ట్రమంత్రి డి.శ్రీధర్బాబుగారిది... అసలే మంత్రిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని తెలంగాణవాదులు నిరసనలు వ్యక్తం చేస్తుంటే.. రాజమండ్రిలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రిగారు... తెలంగాణలో గోదావరి నీళ్లు తాగినా తెలివి పెరగటం లేదన్నారు... మరి ఇది ఆవేదనో... ఆ ప్రాంతంలో అలా మాట్లాడితే మెచ్చుకుంటారనో తెలీదు కానీ.. సార్ మాత్రం అనేదేదో అనేశారు. సరే కానీ, గోదావరి నీళ్లు రాజమండ్రి వాళ్లకే ఎందుకు పడినట్లు..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి