2, ఆగస్టు 2011, మంగళవారం
ఆంధ్రా - హైదరాబాద్ విలీనం పైనా తీర్మానం చేయమంటారా..?
ఈ అనుమానం తెలంగాణకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు వచ్చింది. గతంలో 14F పై అసెంబ్లీ తీర్మానం చేసినా, మరోసారి తీర్మానం చేసి పంపాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ముఖ్యమంత్రిని కోరడంపై ఆయన ఈ విమర్శ చేశారు. 14 F పై మళ్లీ తీర్మానం చేయాల్సి వస్తే రాజ్యాంగ సంక్షోభం వస్తుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం దానికే పట్టుబడితే, ఆంధ్ర,హైదరాబాద్ రాష్ట్రాలు విలీనం కావడం కోసం అప్పటి అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కూడా మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి