9, ఆగస్టు 2011, మంగళవారం
మన దగ్గరా పరువు హత్య!
కని,కష్టపడి పెంచిన కూతుర్నే పరువు కోసం అతి కిరాతకంగా హత్య చేశాడో తండ్రి. మహబూబ్ నగర్ జిల్లా వటవర్లపల్లిలో ఈ దారుణం జరిగింది. తమ కన్నా తక్కువ కులం కుర్రాడిని ప్రేమించిందని మల్లయ్య అనే వ్యక్తి తన కూతుర్ని అత్యంత దారుణంగా కొట్టాడు. అనంతరం ఆమె గొంతులో విషం పోసి చంపాడు. ఇతర కులస్తులను ప్రేమిస్తే హత్య చేయడం హర్యానాలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటినే పరువు హత్యలుగా వర్గీకరిస్తున్నారు. కొన్నాళ్లుగా మన దగ్గరా ఈ విష సంస్కృతి పెరిగిపోతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పరువు ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి http://telugu.stalin-mao.in/-honour-suicides పరువు హత్యలు, పరువు ఆత్మహత్యలు ఈ రెండూ వ్యక్తిగత కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాట నుంచి పుట్టినవే.