23, ఆగస్టు 2011, మంగళవారం
సర్పంచులకు కిరణ్ పోటు
పంచాయతీ ఎన్నికల విషయంలో ఆరు నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించారు కిరణ్కుమార్రెడ్డి. సీఎం నిర్ణయంతో గ్రామపంచాయతీల్లో అధికారం మారుతోంది. ఇప్పటివరకూ అధికారం అనుభవించిన సర్పంచ్లు .. నేటి నుంచి మాజీలైపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 21792 పంచాయతీలకు పదవీకాలం పూర్తవడంతో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో వీటిని వాయిదా వేయడానికే ప్రభుత్వం మొగ్గుచూపింది. దీంతో మధ్యేమార్గంగా సర్పంచ్లనే పర్సన్ ఇంఛార్జ్లుగా నియమించాలంటూ విపక్షాలు, సర్పంచుల సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. మంత్రులు కూడా దీనికే ఓటేశారు. ఎలెక్టెడ్ బాడీలు లేకుండా, గ్రామపంచాయతీలను ఆరునెలలకు మించి కొనసాగించకూడదు. ఇది 74 వ రాజ్యాంగ సవరణకు విరుద్ధం. గతంలో కూడా సర్పంచులనే పర్సన్ ఇంఛార్జ్లుగా నియమించిన దాఖలాలున్నాయి. కానీ, ఈ సారి ప్రభుత్వం మాత్రం అధికారులకే ఓటేసింది. కేబినెట్కూడా దీనికి అనుగుణంగానే నిర్ణయం తీసుకోగా.. సర్పంచ్లనే నియమించాలన్న ప్రతిపాదన చివరినిమిషంలో తెరపైకి వచ్చింది. సీఎం కూడా సర్పంచ్లకే అధికారం అప్పజెప్పుతారంటూ ప్రచారం జరిగినా, చివరకు అధికారులకే అధికారాన్ని అందించాలని సీఎం నిర్ణయించారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలోని సర్పంచ్లంతా నిరుత్సాహపడ్డారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి