11, ఆగస్టు 2011, గురువారం
బోస్ అలా చనిపోలేదట!
నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికుంటే మన దేశం ఇప్పుడు మరోలా ఉండేదన్నది చాలామంది అభిప్రాయం. స్వాతంత్ర్యం కలలను అందరిలోనూ నింపి అకస్మాత్తుగా అంతనార్థమైన సుభాష్ జీ మరణం ఇప్పటికీ సందేహాస్పదమే. విమాన ప్రమాదంలో చనిపోయడని ఎక్కువమంది ఇప్పటికీ నమ్ముతున్నా, చాలా మంది మాత్రం అది నిజం కాదంటారు. స్వాతంత్ర్య దినోత్సవం దగ్గరికొస్తున్న ఈ వేళ, నేతాజీ కారుడ్రైవర్ గా పనిచేసిన నిజాముద్దీన్ ఓ బాంబ్ పేల్చాడు. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మృతిచెందలేదని ఆయన చెబుతున్నారు. 1942లో తాను ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరానని, నాలుగు సంవత్సరాలు నేతాజీతో ఉన్నానని ఆయన వెల్లడించారు. నేతాజీ ప్రమాదం జరిగిన తర్వాతా బ్రతికే ఉన్నారని ధ్రువ పరిచేందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. విమాన ప్రమాదం జరిగిన మూడు నాలుగు నెలల తర్వాత బోస్ను మయన్మార్, థాయ్ల్యాండ్ సరిహద్దుల్లో ఉన్న నది ఒడ్డున కారులో తాను దించానని నిజాముద్దీన్ చెబుతున్నాడు. తానుసైతం నేతాజీతో ఉంటానని అడిగితే ఆయన వారించారని, స్పతంత్య్ర భారతంలో కలుద్దామనే వాగ్దానంతో తనను వెనక్కి పంపించేశారని నిజాముద్దీన్ తెలిపారు. అయితే 10 సంవత్సరాల తర్వాత రిలీఫ్ అండ్ రీపాట్రియేషన్ కౌన్సిల్ ఛైర్మన్ అయిన స్వామిద్వారా సమావేశానికి రమ్మని నేతాజీ ఆహ్వానం పంపారని నిజాముద్దీన్ తెలిపారు. నిజాముద్దీన్ పేర విడుదల చేసిన రీపాట్రియేషన్ పత్రాన్ని అతను ఈ సంఘటనలకు సాక్ష్యంగా చూపిస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అన్నది తేలాల్సి ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా నేతాజీ అజ్ఞాతంలోనే ఎందుకు ఉండిపోయారు? ఇదే అంతు చిక్కడం లేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి