10, ఆగస్టు 2011, బుధవారం
తిరుమలలో ఆంక్షలు..ఆందోళనలో డ్రైవర్లు
తిరుపతిలో ప్రైవేట్ ట్యాక్సీ డ్రైవర్ల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ట్రాఫిక్ ఆంక్షలను నిరసిస్తూ డ్రైవర్లు అలిపిరి వద్ద ఆందోళనకు దిగారు. తమపై ఆంక్షలను ఎత్తివేయాలంటూ ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు డ్రైవర్లను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. వారితో డ్రైవర్లు వాగ్యుద్దానికి దిగారు. ఓ ట్యాక్సీడ్రైవర్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి