9, ఆగస్టు 2011, మంగళవారం
యుద్ధంలో గెలవాలంటే పాండవులే కావాలట
యుద్ధంలో గెలవాలంటే పాండవులే కావాలంట.. ఈ మాటన్నది మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. క్విట్ ఇండియా వేడుకల్లో పాల్గొనడానికి గాంధీభవన్ వచ్చినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ కు ఆయన వస్తున్నప్పుడు మంత్రి దానం నాగేందర్ పక్కనే ఉన్నారు. మిగిలిన మంత్రులు, కాంగ్రెస్ నేతలు కాస్త వెనకగా ఉన్నారు. దీన్ని గమనించిన రిపోర్టర్లు.."ఏంటి సార్, పాండవులతో వస్తున్నారు?" అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగానే, యుద్ధంలో గెలవాలంటే పాండవులతోనే ఉండాలన్నారు సీఎం. కొన్ని రోజుల క్రితమే రాజీనామాలు చేయని తెలంగాణ నేతలు పాండవులని దానం వ్యాఖ్యానించారు. అయితే.. యుద్ధం ఎవరిపై గెలవాలనుకుంటున్నదీ సీఎం చెప్పలేదు. అప్పటికే, ఉద్యోగుల సమ్మెపై కేబినెట్ సబ్ కమిటీ చర్చలకు సిద్ధమయ్యింది. బహుశా సమ్మె విరమింప జేయడాన్నే యుద్ధంగా ఫీలైఉంటారు సీఎం కిరణ్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
గొప్పగా చెప్పారు... నిజమే కాబోలు.