3, ఆగస్టు 2011, బుధవారం
బ్రేకింగ్ న్యూస్.. కర్నాటక సీఎంగా సదానందగౌడ
కర్నాటకలో సంక్షోభానికి తెరపడింది. కొత్త సీఎంగా సదానందగౌడ నియామకం ఖరారయ్యింది. ఈరోజు(03-08-11)న జరిగిన రహస్య ఓటింగ్లో ఆరు ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థి జగదీశ్ షెట్టార్ పై ఆయన గెలుపొందారు. సదానందగౌడను మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరచగా, ఆయన వ్యతిరేక వర్గం జగదీశ్ షెట్టార్ ను బరిలోకి దింపింది. రెండు వర్గాలు సీఎం పదవి కావాలని వాదులాడుకోవడంతో, మధ్యే మార్గంగా బీజేపీ అధిష్టానం రహస్య ఓటింగ్ ను నిర్వహించింది. అయితే.. ఈ ఓటింగ్ సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. యడ్యూరప్ప వైపు ఈరోజు వరకూ ఉన్న గాలి సోదరులు.. జగదీశ్ షెట్టార్ కు అధిష్టానం మద్దతు ఉందన్న కారణంతో ఓటింగ్కు ముందు ఆ వర్గంలో కలిసిపోయారు. అయితే, తీర్పు మాత్రం మరోలా వచ్చింది. ఎమ్మెల్యేలపై యడ్యూరప్ప ప్రభావం ఎక్కువగా ఉండడంతో సదానందగౌడకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం ఉడిపి ఎంపీగా సదానంద కొనసాగుతున్నారు. వివాదరహితుడన్న పేరు ఆయనకుంది. రహస్య ఓటింగ్ లో గెలుపొందడంతో సదానందగౌడనే సీఎం పీఠంపై బీజేపీ కూర్చోబెట్టనుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి