2, ఆగస్టు 2011, మంగళవారం
అలిగిన మెగాస్టార్..
Categories :
chirnajeevi . POLITICS . TOP
తిరుపతి వాసులపై చిరంజీవి అలిగారు. సొంత జిల్లాలో ఓడిపోయినా, చిరంజీవిని నెత్తిమీద పెట్టుకుని గెలిపించిన తిరుపతి జనంపై ఆయన మండిపడుతున్నారు. వాళ్ల ఊసెత్తితేనే చిర్రెత్తిపోతున్నారు. అవును, చిరంజీవి కోపం వెనుక కారణఁ ఉంది. ఏదో ఎమ్మెల్యే కాబట్టి.. అప్పుడప్పుడూ వీలు చూసిని నియోజకవర్గంలో పర్యటిస్తున్న చిరంజీవికి ఈ మధ్య అక్కడ సమస్యలు ఎక్కువయ్యాయి. ఎప్పుడు పర్యటించినా, ఏదో ఓ వర్గం అడ్డుపడుతోంది. చిరంజీవికి వ్యతిరేకంగా గొడవ చేస్తోంది. తాజా టూర్లోనూ అవే సన్నివేశాలు పునరావృతమయ్యాయి. అందుకే.. ఇవాళ(మంగళవారం) తిరుపతి టూర్ను హడావిడిగా రద్దు చేసుకుని అర్థరాత్రి తిరుపతి నుంచి చిరంజీవి వెళ్లిపోయారు. వాస్తవానికి ఇవాళ రుయా ఆస్పత్రి సందర్శనతో పాటు, ట్రాఫిక్ సమస్యపై అధికారులతో ఆయన సమీక్షించాల్సి ఉంది. కానీ, తిరుపతి ప్రజలే తనకు సహకరించనప్పుడు, ఇవన్నీ ఎందకనుకున్నారో ఏమో.. అర్థరాత్రి సమయంలో మనసు మార్చేసుకున్నారు. చెన్నై వెళ్లిపోయి.. అక్కడి నుంచి ఉదయాన్నే హైదరాబాద్కు వచ్చేశారు. చిరంజీవి ఇలానే వ్యవహరిస్తే, వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి గెలవడమూ కష్టంగానే కనిపిస్తోంది..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి