22, జులై 2011, శుక్రవారం
కోనసీమలో ఖాకీల కలకలం
ప్రశాంతంగా ఉన్న కోనసీమ ఇపుడు ఖాకీల చక్రబంధంలో ఇరుక్కుపోయింది. ఎక్కడ చూసినా పోలీసులు..సీఆర్పీఎఫ్ బలగాల బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లుతోంది. అసలు ఏం జరుగుతోంది..ఎప్పుడూ లేనంతగా ఇప్పెడుందకని జవాన్లు ఇక్కడ దిగారు. కోస్తాంధ్రకు ఉగ్రవాదుల ముప్పు ఏమైనా పొంచి వుందా..లేక ఇంకేదైనా ప్రమాదం రానుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది..?
కోస్తాంధ్ర టెర్రరిస్టులకు అడ్డాగా మారిందా..? అసాంఘిక శక్తులు కోనసీమలో తిష్ట వేశాయా..? వేర్పాటువాదులు ఏమైనా కుట్ర పన్నారా..? ఎప్పుడూ లేనిది ఇప్పుడు.. పోలీసు బలగాలు ఎందుకు మోహరించాయి..? ఈ ప్రశ్నలే ఇప్పుడు కోనసీమ వాసులను వేధిస్తున్నాయి. పచ్చదనానికి..ప్రశాంతతకు నిలయమైన కోనసీమలో ఇపుడు ఖాకీల బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లుతోంది. ప్రస్తుతం ఈ ప్రాంతమంతా సీఆర్పీఎఫ్ బలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది. కవాతులు చేస్తూ.. జనాన్ని కంగారు పెడుతున్నారు. తీరం నుంచి ఉగ్రవాదులు సీమపై దాడి చేయనున్నారా ...ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమైనా హెచ్చరికలు చేశాయా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 9 అనంతరం కోనసీమలోనే ఎక్కువగా ఆందోళనలు చోటుచేసుకున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ముందస్తుగా కేంద్రం బలగాలను రప్పించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి