27, జులై 2011, బుధవారం
ప్రత్యేక కృష్ణా రాష్ట్రం కోసం రాజీనామాలు చేయిస్తా..!
తెలంగాణ రాజీనామాలతో కడుపుమండిన సీమాంధ్ర నేతలు రోజుకో ప్రకటన చేస్తున్నారు. రాజీనామాలు చేస్తే రాష్ట్రం ఇచ్చేస్తారనుకుంటే ఎలా అంటూ తెలంగాణ వాదులను ప్రశ్నించారు ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు. రాజీనామాలు చేసినప్పుడల్లా రాష్ట్రం ఇచ్చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లైతే.. కృష్ణా రాష్ట్రం కావాలని ఎంతమందితో అయినా నేను రాజీనామా చేయిస్తానంటూ సవాల్ విసిరారు. ఇది తెలంగాణ వాదులను దెప్పి పొడవడానికే అయినా.. రాజీనామాలతో ఏమీ సాధించలేరని చెప్పడమూ కావూరి ఉద్దేశమే. ఆజాద్ తో తెలంగాణ నేతల చర్చలు పూర్తి కావడంతో.. సీమాంధ్రుల తరపున వినిపించాల్సిన వాదనలపై కావూరి ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ బాంబు పేల్చారు. ఎంతకాదన్నా... తన ఏరియాకూ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఫీలింగ్ కావూరి మనసులో ఉందేమో...!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి