22, జులై 2011, శుక్రవారం
అశ్రునయనాలతో యాదిరెడ్డి అంత్యక్రియలు
తెలంగాణ కోసం పార్లమెంటు సమీపంలో బలిదానం చేసుకున్న యాదిరెడ్డి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ఇవాళ (22/07/11) జరిగాయి. యాదిరెడ్డి స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా పెదమంగళారంలో యాదిరెడ్డి భౌతికఖాయాన్ని ఖననం చేశారు. తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడడంతో, పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇవాళ అంతిమయాత్ర జరుగుతుందని తెలిసి వందలాది మంది పెదమంగళారానికి చేరుకున్నారు. యాదిరెడ్డికి తుదినివాళులు అర్పించారు. టీఆర్ఎస్ నేతలు, టీడీపీ నేతలు, ప్రజా కళాకారులు, తెలంగాణ జేఏసీ నేతలు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి మృతదేహాన్ని తరలించే విషయంలో ఓవర్ యాక్షన్ చేసిన సర్కార్, ఈ రోజు మాత్రం కాస్త వెనక్కి తగ్గింది. ఎయిర్ పోర్టు దగ్గర మీడియాను అరెస్టు చేయడం, ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడంతో నిన్న పోలీసులపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అంత్యక్రియల్లో ఏమాత్రం జోక్యం చేసుకున్నా పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన పోలీసులు సంయమనంతో వ్యవహరించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
యాదిరెడ్డి ఆత్మకు శాంతి చేకురాలి.
కానీ నిన్న ఎ.పి భవన్ లో జరిగినది కే.సి.ఆర్ కుటుంబ సభ్యుల నిజ జీవితానికి నిదర్శనం. తెలంగాణా ఉద్యమ ముసుగులో వీరు సాగిస్తున్న చందాల దండలకు నిన్నటి సంఘటన నిదర్శనం. వీళ్ళు తెలంగాణకోసం ఢిల్లీ వెళ్ళలేదు శవరాజకీయాలు చేయటానికి వెళ్లారు. వీళ్ళు తెలంగాణా కోసం పోరాడే వాళ్ళయితే, నిన్నటి ఉపఎన్నికలలో ఆత్మ హత్యలు చేసుకున్న కుటుంబాలకు టికెట్ ఇయ్యండి అంటే ఎ ఒక్కరు చేవినకుడా వేసుకోలేదు. వీళ్ళా తెలంగాణా కోసం పోరాడేది. వీళ్ళా తెలంగాణాను అభివృద్ధి చేసేది. రేపు విభజన జరిగితే ఇటువంటి వాళ్ళ పాలనే తెలంగాణాలో ఉంటుంది. కళ్ళు తెరవండి తెలంగాణా వాదులరా.