19, జులై 2011, మంగళవారం
చెప్పేందుకు నీతులు.. చేసేందుకు మాత్రం?
ఓ వైపు ధీరోత్తముడిలా ఫోజు.. మరోవైపు తప్పించుకునే యత్నాలు.. ఇవీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న పనులు. సీబీఐ దర్యాప్తుతో ఎంతో కలవరపడుతున్నప్పటికీ, దాన్ని కూడా సెంటిమెంటుగా మలుచుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. కర్నూలులో ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్, సీబీఐ దర్యాప్తు కక్షసాధింపులో భాగమే అని ప్రకటించారు. తాను పార్టీ పెట్టినప్పటినుంచి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా దాడులు చేస్తోందని ప్రకటించారు. కాలు విరిచినా, వెన్ను విరిచినా నిలబడే ఉంటాను తప్ప.. లొంగే ప్రసక్తే లేదనీ చెప్పారు. కానీ, తెల్లారిందో లేదో.. సుప్రీంకోర్టును జగన్ ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ చేస్తుంటే, అంత భయం ఎందుకు? ఇది కేవలం కక్ష సాధింపే అయినప్పుడు.. ఆయన తప్పేమీ లేనప్పుడు నీతి నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం జగన్ కు లేదా..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి