16, జులై 2011, శనివారం
మీరా రూట్లో మనోహర్
దేశంలో అత్యున్నత చట్టసభ.. లోక్ సభకు స్పీకర్ గా పనిచేస్తున్న మీరాకుమార్ దారిలోనే నడవాలని మన శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయించుకున్నారు. తెలంగాణ కోసం ప్రజా ప్రతినిధుల రాజీనామాల విషయంలో ఏం చేస్తే ఏమవుతుందోనన్న గుబులుతో ఉన్న మనోహర్, మీరాకుమార్ నే ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నారు. లోక్ సభలోనూ తెలంగాణ ఎంపీల రాజీనామాలు పెండింగ్ లో ఉండడం, అధిష్టానానికి మీరాకుమార్ బాగా దగ్గర కాబట్టి, ఆమె తీసుకునే నిర్ణయమే సోనియా మాటగా భావించాల్సి ఉంటుందన్నది స్పీకర్ అభిప్రాయం. అందుకే, వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నారు. రాజీనామాలను ఆమోదించాలంటూ టీడీపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి ఒత్తిడి చేసిన సమయంలోనూ ఇదే విషయాన్ని చెప్పేశారు. ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందితేనే, మీవి పొందాయని స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. దీనిపై తెలంగాణ ప్రజాప్రతినిధులు పైకి ఆగ్రహం వ్యక్తం చేసినా, పదవులు మరికొంత కాలం ఉంటున్నందుకు తప్పకుండా సంతోషపడే ఉంటారు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి