13, జులై 2011, బుధవారం
ముంబైలో మళ్లీ పేలుళ్లు..
ముంబైలో మరోసారి తీవ్రవాదులు రెచ్చిపోయారు. కారులో పేలుడు పదార్థాలు పెట్టి పేల్చారు. బుధవారం సాయంత్రం మూడు చోట్ల స్వల్పవ్యవధిలోనే ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ముంబాదేవి ఆలయం సమీపంలో ఉన్న ఝవేరి బజార్లో తొలి పేలుడు సంభవించింది. ఆ తర్వాత దాదర్ ప్రాంతంలో టాక్సీలో పెట్టిన బాంబులు పేలాయి. ఏడుగంటల సమయంలో ఒపేరా హౌజ్ దగ్గర మరో పేలుడు చోటు చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారమే ఈ పేలుళ్ల ధాటికి 18 మంది చనిపోయారు. వందమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్లలో ఒకటి మానవబాంబుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుళ్లు జరగగానే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ హై అలర్ట్ ప్రకటించింది. ముంబై సహా ప్రధాన నగరాల్లో భారీగా తనిఖీలు చేపట్టింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ముంబైకి పంపించింది. ఈ పేలుళ్లకు ఉగ్రవాద ముఠాల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. మన భద్రతా వ్యవస్థ ఎంత మొద్దు నిద్రలో ఉందో ఈ పేలుళ్లు మరోసారి స్పష్టం చేశాయి. ఇంటెలిజెన్స్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో, ప్రజల ప్రాణాలకు ఎంత పెద్ద ప్రమాదం ఉందో ఈ పేలుళ్లు దేశం మొత్తానికి చాటి చెప్పాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి