1, జులై 2011, శుక్రవారం
మళ్లీ రాజీనామాల బాట..!
జులై 1న డిసైడ్ చేస్తామంటూ.. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ హైకమాండ్ కు డెడ్ లైన్ విధించిన ఆ పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు అంతిమ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణపై తేల్చడానికి జులై 5వరకూ సోనియమ్మకు, మన్మోహన్ సర్కారుకు గడువిచ్చినా.. ఒక్కరోజు ముందుగానే తమ నిరసనను ప్రకటించబోతున్నారు. జులై 4నే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సామూహిక రాజీనామాలను సమర్పించాలని, శుక్రవారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానించారు. రాజీనామాలకు చాలామంది విముఖత చూపించినా, ఈ సమయంలో వెనక్కి తగ్గితే ప్రజల్లో చులకనవుతామన్న సీనియర్ల హెచ్చరికతో దారికొచ్చారు. ఎమ్మెల్యేలంతా నేరుగా స్పీకర్ కే రాజీనామాలు సమర్పిస్తామంటున్నారు. జులై 5నే రాజీనామాలు, దీక్షలు అనుకున్నా, 4వ తేదీనే సీమాంధ్ర నేతలు ఢిల్లీ వెళుతుండడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముందుగానే రాజీనామాలకు డిసైడ్ చేశారు. అయితే.. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి మాత్రం రాజీనామా చేయనంటూ తేల్చిచెప్పారు. మరికొంతమంది ఎమ్మెల్యేలూ రాజీనామాలు సమర్పించకపోవచ్చు. కాంగ్రెస్ నేతల నిర్ణయంతో కంగుతిన్న తెలంగాణ తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు.. తామూ రాజీనామాలు చేస్తామంటూ ప్రకటించారు. తుది నిర్ణయం కోసం జులై 3వ తేదీన సమావేశం కాబోతున్నారు. అయితే.. కాంగ్రెస్లో ఎంతమంది రాజీనామాలు చేస్తారన్నది మాత్రం అంతుబట్టడం లేదు. ముఖ్యంగా మంత్రులంతా రాజీనామాలు చేయకపోవచ్చు. గడువులోగా కాంగ్రెస్ హైకమాండ్ వేసే ఎత్తులతో ఎవరైనా వెనక్కి తగ్గినా తగ్గొచ్చు. ఎమైనా జరగొచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి