29, జూన్ 2011, బుధవారం
రాష్ట్రం కష్టమే.. మండలైతే ఓకే
తెలంగాణపై కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధమవుతోంది. విషయాన్ని తెగేవరకూ లాగితే కష్టమనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. కార్యాచరణకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానేపార్టీ నేతలతో అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన బొత్సను పీసీసీ ప్రెసిడెంట్ గా నియమించడం, తెలంగాణకు చెందిన దామోదర్ రాజనర్సింహకు ఉపముఖ్యమంత్రిపదవి కట్టబెట్టడం చూస్తే.. రాష్ట్ర విభజనపై త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటించేలానే కనిపిస్తోంది.
అయితే.. తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నట్లు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సోనియా బృందం సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దానికన్నా శ్రీకృష్ణ కమిటీ సూచించినట్లు ప్రత్యేక మండలిని ఏర్పాటు చేసి భారీ ఆర్థికసాయాన్ని అందించాలనుకొంటోంది. ఢిల్లీలో కీలక నేతలందరినీ కలుసుకున్న అనంతంర డిప్యూటీ సీఎం రాజనర్సింహ.. మండలికైనా తమకు సమ్మతమేనని ప్రకటించడం అందులో భాగమే కావచ్చు. తాజాగ సీఎం కూడా ఢిల్లీకి వెళుతుండడంతో.. అసలు విషయాన్ని ఆయనకు అధిష్టానం చెప్పొచ్చు. మరోవైపు.. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రం.. ప్రత్యేక రాష్ట్రం తప్ప మరో డిమాండ్ లేదంటున్నారు. జులై 1లోగా తేల్చకపోతే.. రాజీనామాలు, దీక్షలకు సిద్ధం కావాలనుకుంటున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి