కొత్తగా పెళ్లైన జంటలకు ఆషాఢం ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒకే ఇంటిలో ఉండలేక వారు పడే వేదన అంతా ఇంతా కాదు. అయితే.. ఇప్పుడు ఆషాఢం ప్రభావం.. కొత్త జంటలకంటే...
ఎమ్మెల్యేలకే ఎక్కువగా పట్టుకొంది. మంత్రి పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకొని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న కొంతమందికి ఆషాఢం అడ్డంకిగా మారింది. మంత్రి వర్గ విస్తరణపై అధిష్టానం చెప్పినట్లే నడుచుకోవాలని, ఎవరెవరికి ఏఏ బెర్తులు ఇమ్మంటే అవే ఇవ్వాలని నిర్ణయించుకున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతానికి ఆషాఢం సాకును చూపిస్తున్నారు. ఆషాఢం అయ్యే వరకూ విస్తరణ చేయలేమంటున్నారు. అధిష్టానంతో సమావేశంలోనూ ఇదే విషయాన్ని చెప్పబోతున్నారు. అటు పీఆర్పీ నుంచి మంత్రులు కావాలనుకుంటున్నవారు.. పోర్ట్ ఫోలియోలు మార్చుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ మంత్రులు.. ఆషాఢాన్ని తెగ తిట్టుకుంటున్నారు.
కామెంట్ను పోస్ట్ చేయండి