6, జూన్ 2011, సోమవారం
బ్రేకింగ్ న్యూస్.... పీసీసీ ప్రెసిడెంట్గా బొత్స
రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు మరో పదవి లభించింది. రాష్ట్ర కాంగ్రెస్లో అత్యున్నత పదవైన పీసీసీ అధ్యక్ష పదవి వరించింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ అజాద్తో కలిసి, సోమవారం సోనియాను కలిసిన బొత్స, పీసీసీ చీఫ్ పదవిని పొందారు. ఉత్తరాంధ్రకు చెందడం, కాపు సామాజికవర్గానికి చెందడం, కాంగ్రెస్లో పలుకుబడి ఉన్న నేత కావడం, రాజకీయాలపై పట్టుండడం వంటి చాలా కారణాలు బొత్స ఎంపికకు దోహదపడ్డాయి. అయితే.. బొత్సను పీసీసీ అధ్యక్షుడిగా కూర్చోబెట్టడం వల్ల తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలా వ్యవహరించబోతుందన్నది స్పష్టం కాలేదు. కానీ, సీమాంధ్ర నేతలను కంట్రోల్ చేస్తూ, తెలంగాణ ఇవ్వడానికే సత్తిబాబును పీసీసీ పీఠంపై కూర్చోబెట్టి ఉండొచ్చన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి రావచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి