11, ఫిబ్రవరి 2011, శుక్రవారం
చచ్చి బతకొచ్చు!
Categories :
మరణం మనల్ని నీడలా వెంటాడుతుంది. మనం ఎటు వెళితే అటు వస్తుంది. సమయం చిక్కగానే మనల్నికమ్మేస్తుంది. మన సిటీల్లో.. మన రోడ్లపై బయటకు వెళితే.. సేఫ్గా వస్తామన్న గ్యారెంటీ కూడా లేదు. సడన్గా, మనం అపాయంలో చిక్కుకుంటే.. సడన్గా మన ప్రాణంపోతే.. ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి...
ఏదో పని పడింది.. సడన్గా బయటకు వెళ్లాలి.. టూవీలర్పై బయల్దేరాం.. కానీ.. సేఫ్గా ఇంటికి రాగలమా..?
పెళ్లో.. ఫంక్షనో.. పిలుపు వచ్చింది. ఇంటిల్లపాదితో కలిసి సరదాగా ప్రయాణమయ్యాం.. సురక్షితంగా మనం వెళ్లగలమా..? ఒకవేళ వెళ్లినా.. సేఫ్గా తిరిగి రాగలమా..?
ఉదయం లేచిన దగ్గర నుంచి మనకు దుర్వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. బస్సు లారీ ఢీ అనో.... ఆటోను కారు ఢీకొట్టిందనో.. హైవే పై భారీ ప్రమాదమనో.. టూవీలర్పై వెళుతున్నవారు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారనో... ఇలా ఎన్నో రకాల వార్తలను ఉదయాన్నే వినిపిస్తాయి. అంతే మన మనసు కీడును శంకిస్తుంది. మనకూ అలాంటి చావు ఎదురవుతుందేమోనని భయం వేస్తుంది.
రోడ్డు ప్రమాదాలు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. ఏ పాపం చేయని వారు.. ఏ తప్పూ చేయనివారు అనవసరంగా ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. క్షణ కాలం క్రితం తమవారితో సరదాగా కబుర్లాడిన వారు.. అంతలోనే రక్తపుమడుగులో ఉండాల్సి వస్తోంది. యాక్సిండెంట్ కావడానికి మనం పొరపాటు చేయక్కర్లేదు. .అవతలివాడి చేసినా చాలు.. మరి ఇలా మనం ప్రాణం కోల్పోవాల్సిందేనా..?
ఇక గుండెజబ్బులు... లైఫ్ స్టైల్ మారిపోయిన తరుణంలో గుండెపోటుకు చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా పోయింది. ఎవరికైనా, ఎప్పుడైనా హార్ట్ అటాక్ రావచ్చు. గుండె ఆగిపోవచ్చు. ఉన్నపళాన కుప్పకూలిపోవచ్చు.
వయస్సు మళ్లిన వారు చనిపోతే, పెద్దగా ఫీలవ్వాల్సిన పనిలేదు. కానీ, ఎన్నో బాధ్యతలు మోస్తూ.. ఎంతోమందికి అండగా ఉన్నవారు సడన్గా ఇలా ఏ యాక్సిడెంట్లోనే చనిపోతే.. పరిస్థితి ఏమిటి? పైగా, యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రాణాలు పోయినట్లు ఉంటే.. వారిని కదపడానికి కూడా మన అంబులెన్స్ టీంలు సిద్ధంగా ఉండవు. ఊపిరి పీల్చేవారినే హాస్పిటల్కు తీసుకువెళతాయి. కానీ.. చనిపోయారని మనం అనుకుంటున్నవారు నిజంగానే చనిపోయారా...? గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతే.. వారి ప్రాణం పోయినట్లేనా..? వారిని బతికించే మార్గం లేదా..? చనిపోయామనుకున్నవారికి ప్రాణం పోయలేమా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే.. ఇలా ప్రమాదాల్లో చిక్కుకుని మరణించారన్నవారిని మనం మళ్లీ బతికించవచ్చు.
చచ్చినవారిని ఎలా బతికించవచ్చు?
మే 20, 1999.. నార్వే లోని మంచుకొండలు..
ఈమె పేరు .. అన్నా బాగెన్హోమ్. మే 20 సాయంత్రం మంచుకొండల్లో స్కీయింగ్ చేస్తోంది.
స్కీయింగ్లో అన్నా ఎక్స్పర్ట్ అయినప్పటికీ, రెగ్యులర్గా స్కీయింగ్ చేయడం ఆమెకు అలవాటే అయినప్పటికీ.. ఆ రోజు మాత్రం పట్టు తప్పింది. కొండపై నుంచి వేగంగా వస్తున్న అన్నా... గడ్డకట్టిన నీటిప్రవాహంలోకి పడిపోయింది. అదుపుతప్పి పడడంతో ముందుగా ఆమె తల నీటిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె శరీరమంతా మంచు గడ్డ కిందకు వెళ్లిపోయింది.. అప్పుడు సమయం.. సాయంత్రం 6.20 నిమిషాలు...
కొంతసేపటి తర్వాత ఈ విషయాన్ని ఆమె స్నేహితులు గుర్తించి.. పోలీసులకు ఫోన్ చేశారు. ఐస్ కింద అన్నా చిక్కుకుపోవడంతో.. ఆమె శరీరం గడ్డకట్టుకుపోతోంది. దాదాపు 40 నిమిషాల పాటు ఆమె బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ లాభం లేకపోయింది. అన్నాను రక్షించడం ఆమె స్నేహితుల వల్లా కాలేదు. కానీ పూర్తిగా మంచు కిందకు వెళ్లిపోకుండా ఆమె కాళ్లను పట్టుకుని ఆపగలిగారు. చివరకు, ఆమె శ్వాస ఆగిపోయింది. ఈ లోగా వచ్చిన రెస్క్యూ టీం ఐస్ను బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది కానీ, సాధ్యం కాలేదు. రెండో టీం తీసుకువచ్చిన టూల్స్తో గడ్డకట్టిన మంచును తొలగించి.. అన్నాను బయటకు లాగారు. అప్పటికి సమయం... రాత్రి 7 గంటల 40 నిమిషాలు. అంటే దాదాపు గంటా 20 నిమిషాల పాటు మంచునీటిలోనే అన్నా బందీ అయ్యింది. ఆమె శరీరం గడ్డకట్టుకుపోయింది. శ్వాస ఆడడం లేదు. అసలు శరీరంలో చలనమే లేదు. అందరి దృష్టిలో ఆమె చనిపోయింది..
మరి కాసేపటికి రెస్క్యూ హెలికాప్టర్ రావడంతో, అన్నాను ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో ఆమెను రక్షించడానికి ఛాతిని నొక్కుతూనే ఉన్నారు. CPR ద్వారా ఆమె శ్వాస తీసుకొనేలా చేయాలన్నది రెస్క్యూటీం ఆలోచన. మరో వైపు ఆక్సిజన్ను అందిస్తూనే ఉన్నారు. కానీ, ఆమె మాత్రం దేనికి రెస్పాండ్ కాలేదు. హాస్పిటల్కు వచ్చేసరికి సమయం రాత్రి 9 గంటల 10 నిమిషాలయ్యింది. అన్నా ప్రమాదంలో చిక్కుకొని అప్పటికి దాదాపు మూడు గంటల సమయం. ఆమె శరీర ఉష్ణోగ్రత 13.7 డిగ్రీల సెంటీగ్రేడ్కు పడిపోయింది. ఓ రకంగా ఆమె శవంతో సమానం.
శరీర ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ తగ్గినా ప్రమాదమే. టెంపరేచర్ పడిపోయే కొద్దీ శరీరంలో అవయవాలు పనిచేయడం మానేస్తాయి. కాసేపు ఐస్వాటర్లో ఉంటేనే మన శరీరం అదుపుతప్పిపోతుంది. ఈ చలి మరీ ఎక్కువైతే.. ప్రాణం కూడా పోతోంది. అందుకే, శీతాకాలం చలిగాలులకు చాలామంది చనిపోతుంటారు. చలి అంత ప్రమాదకరం. అలాంటింది గడ్డకట్టించే నీటిలో చిక్కుకుపోయిన అన్నా చావకుండా ఉంటుందా..?
అన్నా విషయంలోనూ అదే జరిగింది. హాస్పిటల్కు తీసుకువచ్చేసరికి ఆమె శరీరంలోని అవయవాలు పనిచేయడం లేదు. దాదాపు వందమందికి పైగా డాక్టర్లు, నర్సులు అన్నాను కాపాడడానికి తొమ్మిదిగంటలకు పైగా శ్రమించారు. కార్డియోపల్మొనరీ బైపాస్ మిషన్ ద్వారా, ఆమె బ్లడ్ టెంపరేచర్ను పెంచుతూ మళ్లీ శరీరంలోకి పంపించారు. రాత్రి 10 గంటల 15 నిమిషాలు. డాక్టర్ల ప్రయత్నం ఫలించింది. అప్పుడే మళ్లీ ఆమె గుండె కొట్టుకోవడం మొదలయ్యింది. అర్ధరాత్రి సమయానికి శరీర ఉష్ణోగ్రత నార్మల్ లెవల్కు వచ్చేసింది. రాత్రి 2 గంటల 20 నిమిషాలకు ఆమె ఊపిరితిత్తులు పనిచేయడం మొదలయ్యాయి. అప్పటివరకూ టెన్షన్గా గడిపిన డాక్టర్లంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.. ఎందుకంటే.. అన్నా బతికింది.
ఆ తర్వాత 35 రోజుల పాటు వెంటిలేటర్పైనే ఆమె గడపాల్సి వచ్చింది. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 140 రోజులు పట్టింది. మొత్తానికి శ్వాస తీసుకోకుండా దాదాపు మూడుగంటలపాటు ఉన్న మనిషి బతకడం నిజంగా అద్భుతమే. అన్నా విషయంలో అదే జరిగింది. చచ్చి బతకవచ్చని ఆమె నిరూపించింది..
గుండె ఆగినా..?
గుండె ఆగిపోయింది.. శ్వాస తీసుకోవడమూ ఆగిపోయింది.. ఈ స్టేజ్లో ఉంటే.. ఏమంటాం.. చచ్చిపోయారనే కదూ.. కానీ, ఈ స్థితిలోకి వెళ్లినా మనిషిని బతికించవచ్చని.. మళ్లీ ప్రాణం పోయొచ్చని అన్నా ఉదంతం నిరూపించింది. ఎంతోమందిలో ఇప్పుడు ఆశలు రేపుతోంది.
అన్నా యాక్సిడెంట్ జరిగిన తీరే ఆమెను రక్షించిందని చెప్పొచ్చు. ఆమె తల ముందుగా ఐస్ వాటర్లో పడడంతో బ్రెయిన్ కూల్ అయిపోయింది. హార్ట్ బీట్ ఆగిపోవడానికి ముందే.. శరీరం పూర్తిగా చల్లబడిపోవడంతో కణాలకు ఆక్సిజన్ అవసరం లేకుండా పోయింది. ఆ తర్వాత హార్ట్ ఆగిపోయినా.. బాడీసెల్స్, బ్రెయిన్ సెల్స్ చనిపోకుండా ఉండగలిగాయి. శరీర ఉష్ణోగ్రత 13.7 డిగ్రీలకు వచ్చేయడంతో ఆమె హైపోథెర్మియా కండీషన్లోకి వెళ్లిపోయింది. అందుకే.. ఆమె ప్రాణాన్ని మళ్లీ పోయగలిగారు డాక్టర్లు.
అత్యాధునిక వైద్యం
అన్నా విషయంలో యాక్సిడెంటల్గా జరిగినదాన్నే.. ఇప్పుడు హైఎండ్ మెడికల్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తున్నారు. హైపోథెర్మియా పద్దతిని ఉపయోగిస్తూ.. ఎంతోమందికి ప్రాణం పోస్తున్నారు. మెడికల్ ట్రీట్మెంట్లో ఇది ఎంత ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవడానికి.. మరో వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి. అతనే.. ఇస్మాయిల్ డెజ్బాడ్.
ఇస్మాయిల్కు ఓ సారి సడన్గా కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. టెస్ట్లు చేయించుకుంటే.. గుండె చుట్టూ ఉన్న రక్తనాళాలకు తక్షణం సర్జరీ చేయాలని చెప్పారు. ఆలస్యం చేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం. కానీ, అక్కడే ఓ రిస్క్ ఉంది. బ్రెయిన్కు వెళ్లే రక్తనాళాలను కట్ చేయాల్సి ఉంటుంది. ఆ పని చేస్తే బ్రెయిన్ సెల్ డ్యామేజ్ అయ్యి.. ప్రాణం పోవచ్చు. సాధారణ బైపాస్ సర్జరీ ఈయన విషయంలో పనిచేయదు. ఆపరేషన్ చేస్తున్న సమయంలో బ్రెయిన్ పనిచేయకూడదు.. అలాగే హార్ట్ కూడా పనిచేయకూడదు.. మరి ఆపరేషన్ చేయడం ఎలా.. ? ఆయన్ను బతికించడం ఎలా..? అందుకే.. ముందుగా ఆయన్ను చంపేయాలనుకున్నారు డాక్టర్లు.. అదే పనిచేశారు.
ఇది హత్యకాదు.. వైద్యం కోసం కాసేపు మనిషిని నిర్జీవిగా మార్చడం. అందుకు ఉపయోగపడుతుంది హైపోథెర్మియా. సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత 35 నుంచి 36 డిగ్రీలు ఉంటుంది. దీన్ని ఈ టెంపరేచర్ తగ్గే కొద్దీ, ఆక్సిజన్ వినియోగం తగ్గుతుంది. 18 డిగ్రీల సెల్సియస్కు తీసుకువస్తే.. మెదడు సుప్తచేతనావస్థలోకి చేరుకుంటుంది. హార్ట్ కూడా పనిచేయడం ఆగిపోతుంది. ఇస్మాయిల్ను ఈ స్టేజ్కు తీసుకువచ్చి.. సర్జరీ చేయాలనుకున్నారు డాక్టర్లు. అందుకే.. ముందుగా ఆయన బ్లడ్ టెంపరేచర్ తగ్గించడం మొదలుపెట్టారు. ఐస్క్యూబ్స్ను ప్యాక్ చేసి.. ఆయన తలకింద ఉంచి.. బ్రెయిన్ను డెడ్స్టేజ్కి తీసుకువెళ్లారు.
దాదాపు ఐదారుగంటల పాటు ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత.. ఇస్మాయిల్ బ్రెయిన్ పనిచేయడం మానేసింది. అప్పుడు హార్ట్ నుంచి బ్రెయిన్కు వెళ్లే నాళాలను కట్ చేసి... సర్జరీ పూర్తి చేశారు. ఆ తర్వాత మళ్లీ.. ఆయన శరీరాన్ని వేడెక్కించి తిరిగి హార్ట్, బ్రెయిన్ పనిచేసేలా చేశారు. ఇస్మాయిల్ను బతికించారు.
హార్ట్ పేషెంట్స్కు ఎంతో ఉపయోగం
మనిషి చనిపోయినట్లు కనిపించడానికి... చావడానికి మధ్య ఓ సన్నని గీత ఉంటుంది. ప్రాణం కాపాడుకోవడానికి అతి కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో జాగ్రత్త పడితే మనిషిని బతికించడం సాధ్యమే. సరిగ్గా ఆసమయంలో హైపోథెర్మియాను అప్లై చేస్తే.. మనిషి ప్రాణం పోకుండా ఉండగలుగుతుంది. హార్ట్బీట్ ఆగకముందే.. బ్రెయిన్ను, బాడీని కూల్ చేయగలిగితే, మనిషి చనిపోయినా... మళ్లీ ప్రాణం పోయొచ్చు. ప్రాక్టికల్గా ఇది ప్రూవ్ అయ్యింది.
హైపోథెర్మియా పద్దతిలో ట్రీట్మెంట్ కోసం రకరకాల ఎక్విప్మెంట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మేజర్ హాస్పిటల్స్లో కాస్ట్లీ మెషినరీని వాడుతుంటే.. ఎమెర్జెన్సీ సమయంలో వాడుకోగలిగే కిట్స్కూడా దొరుకుతున్నాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ వచ్చే పేషెంట్లకు ఇవి చాలా ఉపయోగం. స్టోక్ వచ్చిన తర్వాత CPR ఇస్తూ హాస్పిటల్కు తరలిచడం సామాన్యంగా జరిగే విషయం. అయితే.. ఐస్బ్యాగ్స్ ఉంచడం ద్వారా బాడీ టెంపరేచర్ను తగ్గించగలిగితే రోగి బతికే ఛాన్స్లు యాభై శాతం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే, రోగిని హైపోథెర్మియాకు గురిచేస్తే.. బ్రెయిన్ తో పాటు మెటబాలిజమ్ పనిచేయడం నిదానిస్తుంది. ఫలితంగా సెల్స్ డామేజ్ కాకుండా ఉంటాయి.
సీవియర్ బ్రెయిన్ డామేజ్ అయినా, హార్ట్ డామేజ్ అయినా.. హైపోథెర్మియా ఎంతో ఉపయోగపడుతుంది. రోడ్డుప్రమాదాల్లో చిక్కుకున్న వారినీ ఈ పద్దతిలో కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. కాకపోతే.. హైపోథెర్మియా ట్రీట్మెంట్కు కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. మన దేశంలోనూ కొన్ని హాస్పిటల్స్లో మాత్రమే ఈ ట్రీట్మెంట్ జరుగుతోంది.
ఖర్చును తగ్గించగలిగితే ఎంతోమందికి ప్రాణం పోసే ఈ వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు.. ఎమెర్జెన్సీ మెడికల్ టీమ్స్కు కూడా దీనిపై అవగాహన పెంచాలి. ఖర్చు ఎక్కువైనా.. అది ప్రాణం విలువతో పోల్చితే తక్కువే కాబట్టి.. హైపోథెర్మియా అన్ని చోట్లా అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది.. పైగా, హార్ట్ ఎటాక్స్, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా చోటుచేసుకునే మన దేశంలో.. ఈ ట్రీట్మెంట్ ఎంతో ఉపయోగం. మీ ఇంట్లో హార్ట్ పేషెంట్ ఎవరైనా ఇలా మరణానికి చేరువైతే.. ఈ పద్దతిలో కాపాడవచ్చేమో ట్రై చేయండి. అయితే.. అంతకన్నా ముందే దీనిపై మీరు డాక్టర్ను సంప్రదించి అవగాహన పెంచుకోవాలి. ఎమర్జెన్సీ కిట్ దొరికితే.. మీ ఇంట్లో ఒకటి ఉంచుకోవడమూ మంచిదే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Manchi information andi.........
really good information